22 April, 2026 | 7:22 PM

Breaking News

ఐలేని రెడ్డి సంఘం అధ్యక్షునిగా మల్లారెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు   •   గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్   •   వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •  

మైనార్టీ మంత్రి లేని ఏకైక కాంగ్రెస్ కేబినెట్ రేవంత్ రెడ్డిదే

23-10-2025 02:07 PM

కాంగ్రెస్ సర్కార్ ముస్లింలను అన్యాయం చేస్తోంది

హైదరాబాద్:  కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆరోపించారు. మైనార్టీ మంత్రి లేని ఏకైక కాంగ్రెస్ కేబినెట్ రేవంత్ రెడ్డిదే అన్నారు. ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇవ్వకుండా అజారుద్దీన్ ను బలి చేశారని పునరుద్ఘటించారు. సీఎం, మంత్రి మధ్య గొడవలో ఐఏఎస్ అధికారి రిజ్వీని బలిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఐఏఎస్ కే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని కేటీఆర్ ప్రశ్నించారు. శ్మశాన వాటిక విషయంలో జూబ్లీహిల్స్ మైనార్టీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక శ్మశాన వాటికకు భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి గుణపాటం చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ముస్లిం నేత సల్మాన్ ఖాన్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.