ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ప్రతిజ్ఞ
అర్మూర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై మున్సిపల్ యంత్రాంగం సమాయాత్తమయ్యారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ పాలకవర్గం, అధికారులు ప్రతిజ్ఞ చేశారు పట్టణంలోని ప్రతి వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రతిజ్ఞ పూనారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ గోనె లహరి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికను అమలు చేస్తామని అన్నారు. ప్రతి వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అర్మూర్ పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంమున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, కౌన్సిలర్లు కొడిగెల మల్లయ్య, దియా విజయ్ అగర్వాల్ ల, సడక్ వినోద్, భూపేందర్, ఆసిఫ్, ప్రసాద్, మెడిసిటీ దామోదర్, గోనె రఘు, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




