24-12-2025 08:44:49 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): స్థానిక వావిలాలపల్లి లోని అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో వేడుకగా నిర్వహించినటువంటి ముందస్తు క్రిస్మస్ సంబరాలకు ముఖ్య అతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతు ఏసుక్రీస్తు బోధనలు చాలా విలువైనవని, స్ఫూర్తిదాయకమని క్రిస్మస్ పండుగ ప్రేమ, ఆప్యాయతకు నిర్వచనమని మరియు సంతోషానికి ప్రతీకనీ అన్నారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ప్రదేశించినటువంటి ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతం చాలా ఆలోచింపచేసింది. రంగనాన్ని క్రిస్మస్ ట్రీలతో, శాంతా క్లాస్ ఆకనాలతో చక్కగా అలంకరించి పండుగ వార్త మరణాన్ని రెట్టింపు చేశారు.