12 March, 2026 | 9:43 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం

20-01-2026 12:00 AM

జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్

జూబ్లీహిల్స్, జనవరి 19 (విజయక్రాంతి): డివిజనులోని కార్మికుల సంక్షేమానికి ప్రాధా న్యం ఇస్తున్నామని జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ అన్నారు. డివిజనులోని ఇందిరానగర్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ కార్డులను సొంత ఖర్చులతో ఇప్పించారు. అందుకు సంబంధించిన పత్రాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా కార్డులు ఇప్పించామన్నారు.అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్య ఎదురైనా దాన్ని పరిష్కరి స్తానని హామీనిచ్చారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తానని పేర్కొన్నారు. అవసరమైన వారికి అండగా నిలిచి వెన్నంటి ఉంటానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.