calender_icon.png 16 October, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓఆర్‌ఆర్‌పై బస్సు బీభత్సం.. 30 మందికి తప్పిన ముప్పు

16-10-2025 11:48:23 AM

డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుపైకి.

బొలెరోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.

​కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.

​మణికొండ,విజయక్రాంతి: హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు భయానక వాతావరణం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టి, అవతలి వైపు రోడ్డులోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన గురువారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్(Rajendranagar Police Station) పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో చోటుచేసుకుంది. ​ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డివైడర్‌ను దాటి అవతలి వైపునకు దూసుకెళ్లడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ​ప్రమాదం కారణంగా ఔటర్ రింగు రోడ్డుపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. డ్రైవర్ మితిమీరిన వేగంతో బస్సును నడపడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.