15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

విద్యుత్ అంతరాయంతో పట్టణవాసుల ఇక్కట్లు

16-10-2025 02:10 PM

మూడు రోజులు పవర్ కట్ తప్పదు అన్న విద్యుత్ అధికారులు

నష్టపోతున్న విద్యుత్ ఆధార వ్యాపారస్తులు

ఖానాపూర్( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ పట్టణంలో విద్యుత్ అంతరాయం తో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా విద్యుత్ అధికారులు మరమ్మత్తుల పేరుతో పవర్ కట్ చేయడంతో విద్యుత్ ఆధారిత వ్యాపారులు, పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొద్దిరోజులుగా పట్టణంలోని బస్టాండ్ పరిసర కాలనీలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మాటిమాటికి కాలిపోవుతుండటంతో అనేకమంది విద్యుత్ పరికరాలు కాలిపోయి నష్టపోయి బాధపడుతుండగా మరోవైపు మరమ్మత్తులతో రోజుల తరబడి విద్యుత్ కోతలు విధించడం స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో గురువారం నుంచి మూడు రోజులపాటు ఆర్టీసీ బస్టాండ్ చుట్టుపక్కల కాలనీలో విద్యుత్ అంతరాయం ఉంటుందని, ప్రజలు సహకరించాలని అధికారులు కోరినప్పటికీ ముందర దీపావళి పండుగ ఉన్నందున వ్యాపారాలు దెబ్బతింటాయని వాపోతున్నారు.బస్సు స్టాండ్ ఎదురుగా ప్రధాన వ్యాపార కూడలి లో మూడు రోజులు మరమ్మతు పనులు చేపట్టడంతో ప్రజలు వ్యాపారులు చేసేది లేక నీరసిల్లి పోతున్నారు. పనులు రాత్రి పగలు త్వరితగతిన పూర్తిచేసి విద్యుత్ పునరుద్ధరించాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.