06-06-2025 08:32:21 PM
హుజూరాబాద్,(విజయక్రాంతి): బడి బాటతో విద్యాధశ మారుతుందని ప్రధానోపాధ్యాయురాలు కుమారి శనగరం మేఘన అన్నారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని బండ అంకుష్ ఏరియాలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట" కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె బండ అంకుష్ వాడ, డిపో క్రాస్ ప్రాంతాల్లోని గుడిసెల్లో నివసించే తల్లిదండ్రులను ఇంటింటి కలిసారు. పిల్లలకు ఉచిత భోజనం, గుడ్లు, పాలు, రాగి జావా, యూనిఫార్ములు, బూట్లు, పుస్తకాలు, నాణ్యమైన ఇంగ్లీష్ బోధన తదితర ప్రభుత్వ విద్యా ప్రయోజనాలను వివరించి, ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసానికి తగిన వాతావరణం ఉందని వారికి అవగాహన కల్పించారు.
ప్రజా సంఘాల నాయకుడు వేల్పుల ప్రభాకర్ మాట్లాడుతూ... ప్రైవేట్ పాఠశాలల్లో లక్షలు ఖర్చు చేయడం వల్ల విద్యార్ధులపై చెడు ప్రభావం పడుతుంది. కార్పొరేట్ స్కూల్లు తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య దూరం పెంచుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్న టీచర్లు దేశస్థాయి గోల్డ్ మెడల్స్ సాధించిన వారు. నాణ్యమైన విద్యను ఉచితంగా అందించగలిగేది ప్రభుత్వ పాఠశాలలే అని స్పష్టం చేశారు. తల్లిదండ్రులారామీ పిల్లల భవిష్యత్తు కోసం ఆత్మపరిశీలన చేసి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి అని విజ్ఞప్తి చేశారు.