06-06-2025 08:37:11 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువులు చెప్పే ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరిగి బడి పిల్లలను గుర్తించి బడికి పంపాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన నాణ్యతగా ఉంటుందని విద్యార్థులకు ఉచిత పుస్తకాలు నోట్బుక్కులు స్కూల్ డ్రెస్సులు అందిస్తున్నామన్నారు. ప్రైవేటు పాఠశాల విధిగా విద్యాబోధన నిర్వహిస్తున్నందున పిల్లలను సరికారు బడికే పంపాలని ఉపాధ్యాయులు కోరారు. ఆయా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి పాఠశాలలో పోషకుల సమావేశం నిర్వహించి చదువు యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటేల్(MLA Rama Rao Patel), కడెం ఖానాపూర్ లో డిఇఓ రామారావు ఆయ మండలాల్లో ఎంఈఓ ను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.