19 March, 2026 | 3:18 AM

జిల్లా ప్రజలకు ప్రముఖుల ఉగాది శుభాకాంక్షలు

19-03-2026 01:37 AM

నిజామాబాద్, మార్చి 18(విజయ క్రాంతి) : జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. 

ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో  జరుపుకోవాలని అన్నారు.  పరాభవ నామ సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలు, ఆనందోత్సాహాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.