14-08-2025 08:46:49 PM
చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) చేగుంట మండలం వడియారంలోని మైనంపల్లి గార్డెన్ లో జరిగిన పట్టణ కేంద్రానికి చెందిన కామారం నర్సింలు కుమారుడు సందీప్ కుమార్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ప్రముఖ సంఘ సేవకులు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు అయిత పరంజ్యోతి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపిడిఓ చిన్నరెడ్డి, విజయ్ కుమార్, శ్రీశైలం, ఒలియా నాయక్, తలారి లింగం, శ్రీను, చేగుంట మండల పంచాయతీ సెక్రెటరీలు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.