14-08-2025 08:34:36 PM
కోదాడ: మండల పరిధిలోని కరివిరాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణబోతు వెంకటరెడ్డి మృతి బాధాకరమని కోదాడ నియోజకవర్గ శాసనసభ్యులు నలమాధ ఉత్తమ్ పద్మావతి రెడ్డి(MLA Nalamada Uttam Padmavathi Reddy) అన్నారు. గురువారం వెంకట రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీకి, గ్రామానికి వెంకట్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు.