29 April, 2026 | 6:07 PM

ఎండల నుండి కాపాడుకోవాలి: ఎంపీడీవో

29-04-2026 03:21 PM

బోథ్,(విజయక్రాంతి): ఉపాధి హామీ కార్యక్రమంలో పనిచేస్తున్న కూలీలు ఉదయం ఐదున్నర గంటలకి పనిలో చేరి 10 గంటల లోపు తిరిగి వెళ్లాలని ఎంపీడీవో ఎల్ రమేష్ కోరారు. బుధవారం మండల కేంద్రం సమీపంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈనెల 19వ తేదీ వరకు కూలీల డబ్బులు తమ తమ అకౌంట్లో జమ కావడం జరిగిందని తెలిపారు. త్వరలోనే మిగతా డబ్బులు వస్తాయన్నారు ఆయన వెంట ఏపిఓ జగ్జీరావు సిబ్బంది ఉన్నారు.