25-09-2025 10:04:28 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురువారం వార్షిక తనిఖీలో భాగంగా బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. టూ టౌన్ పరిధిలో జరుగుతున్న నేరాలు, తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నీర నియంత్రణపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ లో ఫైళ్ళు, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో పరిసరాలను పరిశీలించి ఎస్సై కిరణ్ కుమార్ ను అభినందించారు.