24-06-2025 12:03:10 AM
మహబూబాబాద్, జూన్ 23 (విజయ క్రాంతి): ప్రజల నుంచి ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను స్వారితగతిన పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కే.వీర బ్రహ్మచారి నిర్వహించారు.
ఈ సందర్భంగా రెవెన్యూ, ఉపాధి తదితర సమస్యలపై 106 దరఖాస్తులను ప్రజలు అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తెచ్చిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. తమ పరిధిలో సాధ్యం కానీ సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో పురుషోత్తం, డి ఆర్ డి ఓ పిడి మధుసూదన్ రాజ్, హౌసింగ్ డిఈ రాజయ్య, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహమూర్తి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ శ్రీమన్నారాయణ, వివిధ సంక్షేమ శాఖల అధికారులు నరసింహస్వామి, శ్రీనివాసరావు, శ్రీనివాస్, డిపిఓ హరిప్రసాద్,
డిహెచ్ఓ మరియన్న, డి సి ఓ వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణమూర్తి, పెన్షన్ అధికారి శంకర్, కలెక్టరేట్ ఏవో పవన్ కుమార్, సెక్షన్ సూపర్డెంట్ వినోద్, భూభారతి కోఆర్డినేటర్ సురేష్, వివిధ మండలాల అధికారులు పాల్గొన్నారు.