9 April, 2026 | 4:19 AM

కేశనపల్లిలో కోతిని మింగిన కొండచిలువ

27-10-2025 10:39 PM

కొండచిలువను కొరికి చంపిన కోతులు..

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామంలో సోమవారం ఓ ఇంట్లోకి కొండచిలువ ప్రవేశించింది. దాదాపు 7 అడుగులు ఉన్న ఈ కొండచిలువ కోతిని నోట కరుచుకొని మింగుతుండగా చూసిన మిగతా కోతుల మంద వింత శబ్దాలతో అరుస్తూ కొండచిలువపై దాడి చేసి సహచర కోతిని విడిపించేందుకు శతవిధాల ప్రయత్నం చేశాయి. అయినా కొండచిలువ మాత్రం కోతిని పూర్తిగా మింగేసింది. ఆ తర్వాత కోతుల గుంపు మొత్తం అ కొండచిలువను దాడి చేసి కొరికి చంపేశాయి.