calender_icon.png 28 October, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేశనపల్లిలో కోతిని మింగిన కొండచిలువ

27-10-2025 10:39:13 PM

కొండచిలువను కొరికి చంపిన కోతులు..

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామంలో సోమవారం ఓ ఇంట్లోకి కొండచిలువ ప్రవేశించింది. దాదాపు 7 అడుగులు ఉన్న ఈ కొండచిలువ కోతిని నోట కరుచుకొని మింగుతుండగా చూసిన మిగతా కోతుల మంద వింత శబ్దాలతో అరుస్తూ కొండచిలువపై దాడి చేసి సహచర కోతిని విడిపించేందుకు శతవిధాల ప్రయత్నం చేశాయి. అయినా కొండచిలువ మాత్రం కోతిని పూర్తిగా మింగేసింది. ఆ తర్వాత కోతుల గుంపు మొత్తం అ కొండచిలువను దాడి చేసి కొరికి చంపేశాయి.