11 March, 2026 | 3:16 PM

Breaking News

గాంధీభవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ కీలక సమావేశం   •   ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •  

పంచాయతీ కార్మికులకు సీనియర్ న్యాయవాది ఆర్థిక సహాయం

27-10-2025 10:37 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం గ్రామపంచాయతీ కార్మికులకు సీనియర్ న్యాయవాది ఎం వి రమణారావు వారి కుటుంబ సభ్యులు సోమవారం నాడు ఐటిడిఏ పిఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట సమక్షంలో 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. పంచాయతీ కార్మికులు విద్యార్థులు పట్టణ ప్రముఖులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో గోదావరి కరకట్ట ప్రాంతంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జరిగిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఐటిడిఏ పిఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, పంచాయితీ శ్రీనివాసరావుతో పాటు సీనియర్ న్యాయవాది రమణ రావు తోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణారావు పంచాయతీ కార్మికులు పడుతున్న కష్టాన్ని చూసి స్వచ్ఛందంగా వారి కుటుంబ సభ్యులు తరఫున 50 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. సందర్భంగా పిఓ సబ్ కలెక్టర్ న్యాయవాది రమణారావుని అభినందించారు.