25-10-2025 12:39:09 AM
కామారెడ్డి, అక్టోబర్ 24 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో స్టాటికల్ ఆఫీసర్గా విధులు నిర్వహించిన రఘునందన్ పదోన్నతిపై కామారెడ్డి జిల్లాకు సిపిఓగా బదిలీ అయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు నోటుబుక్కులు అందజేశారు. కొత్త బాధ్యతల్లో సమర్థవం తంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమా ల్లో చురుకుగా ఉండాలన్నారు.