3 April, 2026 | 2:26 PM

Breaking News

TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •   రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •  

అక్రమ నిర్మాణం కూల్చివేత

25-10-2025 12:37 AM

ఘట్‌కేసర్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : పోచారం మున్సిపల్ ప్రతాప సింగారంలో  హైడ్రా, పోచారం మున్సిపల్ అధికారులు కలిసి  శుక్రవారం అక్రమ నిర్మాణాలు కూల్చి వేశారు. ప్రతాపసింగారంలో సర్వే నెంబర్ లు 315, 316, 317 భవానీనగర్ (బుచ్చిరెడ్డి లేవుట్) లో మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి 6.14 ఎకరాలలో ప్రహరీగోడ అక్రమంగా నిర్మించి ప్రజలకు సంబంధించిన 88 ప్లాట్లు ఆక్రమించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు హైడ్రా, పోచారం మున్సిపల్ అధికారులు సంయుక్తంగా జెసిబితో కూల్చి వేయించారు. దీంతో కాలనీ వాసులు హైడ్రా, మున్సిపల్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.