20-06-2025 12:34:22 AM
ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 19 (విజయ క్రాంతి) : ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ మిస్త్స్రల్ తయారీ యూనిట్ అనుబంధ సంస్థల ఏర్పాటుకు సంబంధించి నేడు దేవరకద్ర మండలంలోని చౌదర్ పల్లి - బస్వాయి పల్లి గ్రామ శివారులలోని ప్రభుత్వ భూమిని అధికారులు డిఆర్డిఎల్ శాస్త్రవేత్తలతో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి అనేది ఉన్నత శిఖరాలను చేరుకుంటుందని, అన్ని రంగాలను సముచిత స్థానం కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా దేవరకద్రకు విచ్చేసిన జనరల్ ఆఫ్ బ్రహ్మోస్ డైరెక్టర్ డాక్టర్ జైతీర్థ్ జోషి, డి ఆర్ డి ఎల్ డైరెక్టర్ డాక్టర్ జీఎ శ్రీనివాస్ మూర్తి , బ్రహ్మోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాంబశివ ప్రసాద్ లతో అధికారులతో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులుఉన్నారు.