హైదరాబాద్: రాహుల్ గాంధీ(Rahul Gandhi) శంషాబాద్ ఎయిర్ పోర్టుకు(Shamshabad Airport) చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ కోసం రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వచ్చారు. రాత్రి 7.15 గంటలకు రాహుల్ గాంధీ ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడనున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రాత్రి 10.30 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. రేవంత్- మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు.