8 July, 2026 | 7:52 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •   ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

గ్రేటర్‌లో మళ్లీ వర్షం

24-09-2024 12:00 AM

రహదారులపై నిలిచిన వరద

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో మూ డు రోజులుగా ఉదయం మమూలుగా ఉండి, సాయంత్రం వేళ్లలో వాన దంచి కొడుతోంది. దీని లో భాగంగా సోమవారం సాయంత్రం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, అల్వాల్, హబ్సీగూడ, తార్నాక, లాలపేట్, ఎల్బీనగర్, నాచారం, ముషీరాబాద్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, అబిడ్స్ , నాం పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రమదారులపై వరద చేరింది. ట్రాఫిక్ జామ్‌తో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందు లు కలిగాయి. అల్కాపురి కాలనీలో అత్యధికంగా 3.6 సెంమీ, అత్యల్పంగా కాప్రాలో 1.2 సెంమీ వర్షపాతం నమోదైంది.