21-05-2025 04:50:07 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శ్రీ ఆర్ రావు నివాస భవనంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాందడపు చిన్ను పట్టణ అధ్యక్షుడు, జునైద్ మెమన్ నిర్మల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమాభిమా రెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు వెంబడి రాజేశ్వర్, దేవలకోట చైర్మన్ శ్రీనివాస్, సాయిబాబా టెంపుల్ చైర్మన్ భూరాజ్, మాజీ ఫులోర్ లీడర్ పోశెట్టి, పొదరి అరవింద్, కొట్టె శేఖర్, అడప శ్రీకాంత్, ఖిజర్, ఆకుల హార్శి, ఎ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.