20 March, 2026 | 7:32 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

రంజాన్ కిట్‌లు అందరికీ అందాలి

20-03-2026 12:00 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, మార్చి 19(విజయక్రాంతి): ప్రభుత్వం పేద ముస్లింలకు  అంద జేసే రంజాన్ కిట్‌లు ప్రతి ఒక్క మైనార్టీ కుటుంబానికి  అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ డిమాండ్ చేశారు. గురువారం భోలక్ పూర్ లో ప్రసిద్ధిగాంచిన బడి మసీదు వద్ద ప్రభుత్వం అందజేసే రంజాన్ కిట్లను ఎమ్మెల్యే ముఠా గోపాల్ బడి మసీదు ముత్తవల్లి నజీర్ అలీ, ముషీరాబాద్ డిఐ నదిముద్దీన్ లతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మసీదుకు 250 రంజాన్ కిట్లను ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ స్థానికంగా పేద కుటుంబాలకు చెందిన ముస్లిం లు అధికంగా నివసిస్తున్నందున అందరికీ రంజాన్ కిట్లు అందడం లేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని పేర్కొన్నారు. రంజాన్ పండుగను ప్రజలంతా ఐక్యంగా జరుపుకొని మతసామరస్యాన్ని కాపాడాలన్నారు.

ఈ సందర్భంగా బడి మజీద్ ముత్తవల్లి ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితర అతిధులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువనాయకుడు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, పార్టీ సీనియర్ నాయకులు రహీం, డివిజన్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అలీ పార్టీ నాయకులు జబ్బార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.