15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అమ్మాయిలపై జరిగే అత్యాచారాలను అరికట్టాలి, మహిళలకు భద్రత కల్పించాలి

18-11-2025 06:08 PM

ముకరంపుర (విజయక్రాంతి): అమ్మాయిలపై జరిగే అత్యాచారాలను అరికట్టాలని, మహిళలకు భద్రత కల్పించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ డిమాండ్ చేశారు.  మంగళవారం కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమైందని అన్నారు. షీ టీమ్స్ ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయడం లేదని, మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమవుతుందని అన్నారు.

దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అధికంగా అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాంపెల్లి అరవింద్, గజ్జెల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్, బోగేష్, ఆకాష్ జిల్లా గర్ల్ నాయకులు మానస, అమూల్య, విద్యార్థులు  పాల్గొన్నారు.