17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని రాస్తారోకో

27-10-2025 04:53 PM

నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్మల్ జిల్లా మహిషా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ స్టాచు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏబీవీపీ నిర్మల్ జిల్లా కన్వీనర్ మూడపెళ్లి దినేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 8900 కోట్ల స్కాలర్‌షిప్‌ పెండింగ్లో ఉంది.. గత తొమ్మిది సంవత్సరాలైనా కూడా ఈ యొక్క స్కాలర్‌షిప్‌లను విడుదల చేయడం లేదు.. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయాలేని పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. ఇప్పటికైనా మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల ఎంత పెద్ద ఉద్యమానికైనా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు విభాగ్ SFD కన్వీనర్ గంగా ప్రసాద్, నగర హాస్టల్స్ కన్వీనర్ సంతోష్, గంగారెడ్డి,  ఓంకార్, ప్రకాష్, యోగేష్, శ్రీధర్, ముత్యం, తదితరులు పాల్గొన్నారు.