20-06-2025 01:36:26 PM
హైదరాబాద్: తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) ఆధ్వర్యంలో సోమాజీగూడలో ''పోలవరం తెలంగాణపై జలఖడ్గం'' పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) మాట్లాడుతూ... 5 గ్రామాల ప్రజలకు అనారోగ్యం వస్తే గుంటూరు ఆసుపత్రికి వెళ్లాలని కవిత సూచించారు. మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. ఈ నెల 25న 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సమావేశం ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. సమావేశంలో 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇస్తున్నట్లు ప్రకటించాలని కవిత కోరారు. 5 గ్రామాలు వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కవిత డిమాండ్ చేశారు. కరకట్టల ఎత్తు పెంచుకోవాలి.. లేకపోతే రక్షణ ఉండదని ఎమ్మెల్సీ కవిత సూచించారు. భారీ వరదలు వస్తే ఆయా గ్రామాలు మునిగిపోతాయని కవిత చెప్పారు.