22-07-2025 12:00:00 AM
నల్లగొండ క్రైమ్, జూలై 21: ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే లో బాధితులకు భరోసా కలుగుతుందని జిల్లా sp శరత్ చంద్ర పవర్ అన్నారు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధిత నుండి ఫిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడారు సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలని ఆదేశించారు.. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు.
బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకొవాలని,పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట పరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, ఫిర్యాదుదారునికి భరోసా,నమ్మకం కలిగించాలని అన్నారు. ఎవరైనా చట్టవ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కటినంగా వ్యవహరించాలని అన్నారు. బాధితుల ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.