23-06-2025 01:14:35 AM
మంత్రి సీతక్కకు హరీశ్రావు లేఖ
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): నిధులు విడుదల లేకపో వడంతో గ్రామ పంచాయతీల అభివృద్ది ఎక్కడిక్కడే నిలిచిపోయిందని, వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి, ఎమ్మె ల్యే హరీశ్రావు ఆదివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు లేఖ రాశారు.
పంచాయతీ అధికారులు అప్పులు తెచ్చి మరీ నిర్వహణ కొనసాగించే ప్రయత్నం చేశారని, ఒకవైపు రోజురోజుకీ అప్పులు పెరగటం, మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్ల పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం మరింత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ సర్పంచులు సైతం చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. నిధులను వెంటనే విడుదల చేయాలని, చేసిన పనులకు గాను మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని లేఖలో కోరారు.
అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరిం చాలన్నారు. పారిశుధ్య కార్మికులకు వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే వారికి వేతనాలు చెల్లించాలని కోరారు. గతేడాది నవంబర్లో నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనాలు విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్ కోరారు.