16 April, 2026 | 8:16 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ప్రభుత్వ భూమిలో ఆక్రమణల తొలగింపు

01-05-2025 12:38 AM

చేవెళ్ల, ఏప్రిల్ 30:ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను మొయినాబాద్ రెవెన్యూ అధికారులు తొలగించారు. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం వద్ద సర్వే నెం. 218లోని సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీనిపై తహసీల్దార్ గౌతమ్ కుమార్ కు ఫిర్యాదు అందడంతో బుధవారం జేసీబీ సాయంతో ఫెన్సింగ్, షెడ్ లను తొలగించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ భూముల రక్షణకు ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల గిర్దవర్ రోజా, రెవెన్యూ సిబ్బంది బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.