18 April, 2026 | 12:27 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

డబుల్ బెడ్ రూమ్ కాలనీలో పిచ్చి మొక్కల తొలగింపు

05-04-2025 06:31 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని పాలచెట్టు సమీపంలో నూతనంగా నిర్వహించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను, చెత్తాచెదారని తొలగించారు. పట్టణంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఉందను ఇటీవల పంపిణీ చేయగా లబ్ధిదారులు చెత్తాచెదారం పిచ్చి మొక్కల నిండిపోయాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇవాళ ఇటీవల పట్టిన పర్యటనకు వచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించడం లబ్ధిదారులు తమ సౌకర్యాలను ఎమ్మెల్యేకు ఏకరువు పెట్టారు.

స్పందించిన ఎమ్మెల్యే వెంటనే చెత్తాచెదారం తొలగించాలని విద్యుత్తు తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా పట్టణానికి చెందిన నాల్గవ వార్డుకు కాంగ్రెస్ జిల్లా నాయకులు పుల్లూరి లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మహంత్ అర్జున్ కుమార్ ల ఆధ్వర్యంలో చెత్త చెదారం తొలగింపు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. త్వరలోనే ఇండ్లలో మౌళిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అనుగుణంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించడం జరుగుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఓరుగంటి సురేందర్ లు పాల్గొన్నారు.