26-01-2026 11:11:16 AM
మెదక్ కలెక్టర్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.
ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా అదనపు కలెక్టర్ నగేష్..
మెదక్, జనవరి 26(విజయక్రాంతి) : ఈరోజు 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ మెదక్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ నగేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠకులను, విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అని ,ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలకు కట్టుబడి, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో జీవిస్తూ, ఉత్తమ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డి. ర్ .ఓ భుజంగ రావు, జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు