26-01-2026 12:32:00 PM
వాంకిడి, జనవరి 26(విజయ క్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కవిత ఆధ్వర్యం లో జాతీయ జెండాను ఆవిష్క రించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయ డంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచే యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతి నిధులు, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, మండల అధికారులు, కార్యాలయ సిబ్బంది , గ్రామ ప్రజలు, పాఠశాల విద్యార్థిని, విద్యార్థు లు తదితరులు పాల్గొని గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్య తను గుర్తు చేసుకున్నారు. దేశ భక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా ముగిసింది.