11 March, 2026 | 3:54 PM

Breaking News

విమానంలో 133 మంది ప్రయాణికులు.. ఎయిరిండియాకు తప్పిన ముప్పు   •   భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు   •   ప్రాణం తీసిన చేపల వేట.. కృష్ణా నదిలో గల్లంతైన అన్నదమ్ములు   •   భూ మాఫియా చేసింది మీరే.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు   •   అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు   •   పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి   •   గాంధీభవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ కీలక సమావేశం   •   ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •  

గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

21-01-2026 12:00 AM

కలెక్టర్ కే హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 20 (విజయ క్రాంతి): ఈ నెల 26న జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆర్డీఓ లోకేశ్వర్ రావులతో కలిసి జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగుల జాబితాను ఈ నెల 24వ తేదీలోగా సమర్పించాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై స్టాల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థులచే దేశభక్తి గీతాలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 

గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి కృషి

జిల్లా మొదటి మహిళా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కె. హరిత కెరమెరి మండ లం జోడేఘాట్లోని  భీం సమాధిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ఆదివాసీ నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.