calender_icon.png 28 June, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు పనులు పూర్తి చేయించాలని ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతి

28-06-2025 12:54:01 AM

 ఘట్ కేసర్, జూన్ 27 : ఓఆర్‌ఆర్ రోడ్డు పనులు పూర్తి జరిగి వినియోగంలోకి వచ్చినప్పటికి యంనంపేట్-ఘట్ కేసర్ మధ్యన సర్వీసు రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సర్వీస్ రోడ్డు పనులు పూర్తి చేయించాలని పోచారం మున్సిపల్ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ నర్రి ధనలక్ష్మి కాశయ్య శుక్రవారం మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

గత కొన్ని సంవత్సరాల నుండి సర్వీసు రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ఆరోడ్డు వెంట ప్రయాణిస్తున్న ట్రక్కులు, భారీ వాహనాలు యంనంపేట్ మీదుగా వెళ్ళుతుండడంతో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం శ్రీనిధి కళాశాలకు చెందిన విద్యార్థిని ప్రమాదానికి గురై రెండు కాళ్ళు తీసివేయడం జరిగింది. అదే విధంగా గ్రామములోని పలువురు ప్రమాదాలకు గురై శాశ్వత అంగవైకాల్యానికి గురైనారు. అంటే ఇక్కడ సమస్య ఏవిధంగా ఉన్నదో అర్ధం చేసుకోగలరు. అంతే కాకుండా ఈమార్గం గుండా భారీ వాహనాలు రావడంతో రోడ్డు సైతం పాడైపోతున్నాయి.

మాపై దయతలచి సమస్య పరిష్కరించగలరని కోరుతున్నాము. అలాగేయంనంపేట్ రైల్వే వంతెన రోడ్డు సక్రమముగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమరి ఎంపీ నిధుల ద్వారా సీసీ లేదా బిటీ రోడ్డు ఏర్పాటు చేయగలరని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మారుమూల గ్రామాలకు కృష్ణా వాటర్ వస్తున్నప్పటికి నగరానికి కూత వేటు దూరంలో ఉన్న పోచారం మున్సిపాలిటీలోని 1వ వార్డు ఇస్మాయిల్ ఖాగూడ, 2వ వార్డు అయిన యంనంపేట్ గ్రామాలకు కృష్ణా వాటర్ రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి సమస్య పరిష్కరించగలరని ఎంపీ ఈటెల రాజేందర్ కు అందజేసిన వినతిపత్రంలో మాజీ కౌన్సిలర్ నర్రి ధనలక్ష్మి కాశయ్య కోరారు.