28-06-2025 12:52:30 AM
జేసీబీతో కూల్చివేయించిన తహసీల్దార్
చేవెళ్ల, జూన్ 27 : ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని ఆక్రమించి చేపడుతున్న ఇండ్ల నిర్మాణాన్ని చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య అడ్డుకున్నారు. జేసీబీతో వాటిని కూల్చివేయించి.. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
చేవెళ్ల మండలం నాంచేరి రెవెన్యూలోని ఇంద్రారెడ్డి నగర్లో సర్వే నెంబర్ 56 లో 2 .20 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. ఏడుగురు స్థానికులు ఈ స్థలాన్ని కబ్జా చేసి ఇండ్ల నిర్మాణం చేపట్టారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ కృష్ణయ్య శుక్రవారం రెవెన్యూ సిబ్బంది, పోలీసులతో కలిసి అక్కడకు చేరుకొని జేసీబీ సాయంతో ఇండ్లను కూల్చివేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేదిలేదని, కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ భూపాల్ శ్రీధర్, ఎస్ఐ సంతోష్ రెడ్డి, ఆర్ఐలు చంద్రమో హన్, పవన్, రెవెన్యూ సిబ్బంది నర్సింహులు, ప్రకాష్, ఆంజనేయులు, రవీందర్పాల్గొన్నారు.