11-06-2025 12:13:24 AM
మేడ్చల్, జూన్ 10(విజయ క్రాంతి): మ ల్కాజిగిరి నియోజకవర్గం లోని అల్వాల్ సర్కిల్లో అభివృద్ధి పనులకు నిధులు మం జూరు చేయాలని స్థానికులు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తో కలిసి కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ కు వినతి పత్రం అందజేశారు.
హిందూ, ముస్లిం స్మశాన వాటికలు అభివృద్ధి చేసి, మౌలిక వసతులు కల్పించాలని, మొహర్రం పండుగ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా నిధులు మంజూరు చేయాలన్నారు. ఈ కా ర్యక్రమంలో వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ పాల్గొన్నారు.