11-06-2025 12:14:30 AM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
సూర్యాపేట, జూన్ 10 (విజయక్రాంతి) : భూభారతితో రైతుల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో జరిగిన భూభారతి రెవిన్యూ సదస్సులో ఆయన పాల్గొని రైతుల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి, మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేల చేత పలు దఫాలుగా సమావేశం ఏర్పాటు చేసి నేడు భూభారతికి పోర్టల్ స్వీకారం చుట్టారన్నారు. జూన్ 20 వరకు ప్రతి గ్రామంలో రైతులు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలియపరచగా, వారు పరిష్కరిస్తారన్నారు.
తదుపరి సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలలో నిజం లేదని, కావాలని తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రతిపక్ష నాయకులు కొందరు నిందలు వేయడం తగదన్నారు. అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్వయంగా తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నాపై అసత్య ఆరోపణ చేసి సోషల్ మీడియాలో కించపరిచిన వ్యక్తులపై ఎస్సీ ,ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దయానంద్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, ఎల్సోజి నరేష్ ,డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, ఆలయ చైర్మన్ ఎలగందుల సంజీవ, జిల్లా నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు ,సుంకరి జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.