11-06-2025 12:13:02 AM
నారాయణపేట.జూన్ 10( విజయ క్రాంతి); నారాయణపేట మండలం అప్పక్ పల్లి వద్ద గల మెడికల్ కాలేజీలో కి ఇటీవలే మార్చబడిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. కళాశాల భవనంలో ఏర్పాటు చేసిన ఆస్పత్రికి చెందిన వివిధ వి భాగాలను ఆమె పరిశీలించారు.
ఆస్పత్రిలోని జనరల్ వార్డ్, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వార్డులకు వెళ్ళి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతు న్నాయని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, ఐసిటిసి, ఫార్మసీ, రిజిస్ట్రేషన్ విభాగాలను చూశారు. రిజిస్ట్రేషన్ వద్ద పేర్ల నమోదు రోగులు అధికంగా ఉండడం చూసి రోజుకు ఎంతమంది ఓపి, ఐ పి పేషెంట్లు ఉంటున్నారని అక్కడి కంప్యూటర్ ఆపరేటర్ల ను అడిగి తెలుసుకున్నారు.
ఈ నెల 1 నుంచి జిల్లా ఆస్పత్రి కొత్త భవనంలోకి మార్చడం జరిగిందని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 2 వేలకు పైగా వైద్య సేవలు పొందినట్లు ఆపరేటర్లు కంప్యూటర్ ద్వారా రోజుల సంఖ్య వివరాలను కలెక్టర్ కు చూపించారు. రోగులు, వారి బంధువులు కూర్చునేందుకు అవసరమైన కుర్చీలను ఏర్పాటు చేయించాలని అక్కడి సిబ్బందికి కలెక్టర్ సూచించారు. అనంతరం ఎక్స్ రే, కొత్తగా ప్రారంభించిన సిటీ స్కాన్ విభాగాన్ని ఆమె పరిశీలించారు. వాటితో పాటు ప్రసూతి విభాగం, చిన్న పిల్లల విభాగాన్ని చూశారు.
ఇంకా ఏమైనా అవసరమైతే ఇండెంట్ ఇవ్వాలన్నారు. మూడో అంతస్తులో ఉన్న నాలుగు ఆపరేషన్ థియేటర్లను వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ వై ద్యాధికారులను ఆదేశించారు. చివరగా ఆస్పత్రి వెనుక భాగంలో ఎం సి హెచ్ ( మదర్ అండ్ చైల్ హెల్త్) సెంటర్ నిర్మాణం కోసం కొనసాగుతున్న భూమి చదును పనులను, అవతలి వైపు జరుగుతున్న నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను కలెక్టర్పరిశీలించారు.