1 July, 2026 | 6:33 PM

Breaking News

ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •   రైతు భరోసా చారిత్రక ఘట్టం.. రైతుల కోసం లక్ష కోట్ల వ్యయం: ఎమ్మెల్యే రాగమయి   •  

రెరాను పక్కాగా అమలు చేయాలి

12-06-2024 02:23 AM

సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): సొంతిల్లు కోసం ఎంతో కష్టపడుతున్న ప్రజలు రియల్ ఎస్టేట్ మోసాలతో బలవుతున్నారన్న సీఎం రేవంత్‌రెడ్డి.. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ చట్టం వచ్చి ఏడేళ్లవుతున్నా ఇంకా అనేక మంది స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లో ప్రజలు మోసపోతున్నారని మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ చైర్మన్ జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, సభ్యులు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి చిత్రా రామచంద్రన్‌తో సీఎం భేటీ అయ్యారు. 

స్థిరాస్తి రంగంలో మరింత పారదర్శకత వచ్చేలా చూడాలని కోరారు. ఆస్తులను కొనుగోలు చేసే వారు మోసపోకుండా చూడాలన్నారు. రెరా చట్టం అమలు బాధ్యత రాష్ట్రాలదేనని, ఈ విషయంలో అప్పిలేట్ కమిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెరా ఆదేశాలు కచ్చితంగా అమలు చేస్తే రియల్ ఎస్టేట్ రంగం మరింత విస్తృతంగా పెరుగుతుందని, అనేక మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు. విశ్వసనీయమైన స్థిరాస్తి రంగంగా హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఉండాలని కోరారు.