25-06-2025 12:27:12 AM
స్థానిక సంస్థలు ఎన్నికల అంటే భయపడుతున్న కాంగ్రెస్...
వనపర్తి మండలం : కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు కే మాణిక్యం, రైతు సమితి అధ్యక్షులు నరసింహ, డేగ మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాములు అన్నారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల నాయకులు మంగళవారం దత్తాయిపల్లె, చందాపూర్, సవాయిగూడెం గ్రామాలలో పర్యటించి నాయకులను, ప్రజలను స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతు. కోర్టు మొట్టికాయలు వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదని కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చిందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.