calender_icon.png 8 June, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యల పరిష్కారం

06-06-2025 12:36:19 AM

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 5: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తుంది. అందులో భాగంగానే  ని ర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతాయని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి రైతుల కు సూచించారు. గురువారం తట్టిఅన్నారం, మర్రిపల్లిలో గ్రామాల్లో కొనసాగుతున్న రెవె న్యూ సదస్సులను ఆయన పరిశీలించారు.

అనువుగా ఉన్న సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే పరిష్కరిస్తున్నామని అన్నా రు. రెవెన్యూ సదస్సులను రైతులు, ప్రజలు వినియోగించుకొని భూ సమస్యలను పరిష్కారించుకోవాలని కోరారు. తట్టి అన్నారం కు సంబంధించిన దరఖాస్తులు సక్సేషన్ (విరసత్)2, నాలా కన్వెన్షన్2, అప్లికేషన్3, మ ర్రిపల్లిలో పట్టా సర్టిఫికేట్లు కోసం 5 దరఖాస్తులు,

డిజిటల్ పెండింగ్ 1 చొప్పున వచ్చా యని తెలిపారు. తట్టిఅన్నారంకు సంబంధించిన అప్లికేషన్స్ దాదాపు అసైన్డ్ భూములకు సంబంధించినవేనని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కార్తీక్‌రెడ్డి, సర్వేయర్ జ్యోతి, ఆర్‌ఐలు రాము, ఇంద్రాణి తదితరులుపాల్గొన్నారు