calender_icon.png 8 June, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ సంఖ్య పెంచాలి

06-06-2025 12:37:19 AM

ఖమ్మం, జూన్ 5 (విజయ క్రాంతి):ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ పెంచాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.గురువారం కలెక్టరెట్ లో బడిబాట కార్యక్రమం నిర్వహణ, ఇందిరా డెయిరీ కార్యక్రమం అమలుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, నూతనంగా చేపట్టిన ఉపాధ్యాయుల నియామకం, వస్తున్న మార్పుల అంశాలను పిల్లల తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ సంఖ్య పెంచేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన ఫలితాలు, టాపర్స్ వివరాలతో వీడియోలు రూపొందించి వివరించాలని, ప్రైవేట్ లో తక్కువగా ఫలితాలు వచ్చినా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు ఎక్కువగా వస్తున్న మనం ప్రచారం కల్పించుకోవడం లేదని, దీనిపై దృష్టి సారించి ముఖ్యమైన కూడలిలో ప్రభుత్వ స్కూల్ సౌకర్యాలు, ఫలితాలు వివరిస్తూ హోర్డింగులు, ఫ్లేక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

భవిత సెంటర్ లోని పిల్లల కోసం 7 సీటర్ ఆటో ఏర్పాటు చేయాలని అన్నారు.అనంతరం ఇందిరా డెయిరీ పై సమీక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యం మేరకు పశువుల యూనిట్ గ్రౌండింగ్ కు కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పి సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, డిఇఓ ఎస్. సత్యనారాయణ, ఇడి ఎస్సి కార్పొరేషన్ నవీన్ బాబు, జిల్లా ఎస్సి సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జ్యోతి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి విజయలక్ష్మి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డా. పురందర్, ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, అధికారులు, పాల్గొన్నారు.