19-06-2025 12:08:21 AM
సంజాయిషీ కోరుతూ మెమో జారీ
నాగర్ కర్నూల్ జూన్ 18 ( విజయక్రాంతి )నాగర్ కర్నూలు జిల్లా పెద్ద పెద్దపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తించాల్సిన స్టాఫ్ నర్స్ తన స్థానంలో తన భర్తను పనిచేస్తూ పేద రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందడంతో ప్రజల నుండి తీవ్ర విమర్శలొచ్చాయి.
దీంతో బుధవారం సతీ స్థానంలో పతి డ్యూటీ పేరుతో విజయక్రాంతి వార్త కథనాన్ని ప్రచురించగా జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి స్పందించారు. పెద్దకొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నారాయణస్వామితో పాటు విధులకు డుమ్మా కొట్టిన స్టాఫ్ నర్స్ భాగ్యమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజాయిషీ కోరుతూ మెమోజారీచేశారు.