28 June, 2026 | 3:09 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

చేర్యాల పెద్దచెరువుకు పునరుద్దరణ పనులు

08-01-2026 01:34 AM

చేర్యాల, జనవరి 7: చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో అమృత్ 2.0 పధకం ద్వారా పెద్ద చెరువు పునర్జీవనం కొరకు రూ. 314.60 లక్షలు మంజూరైనట్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ పధకంలో భాగంగా చెరువు కట్ట విస్తరీకరణ, చెరువు చుట్టూ ఇనప రేలింగ్, చైన్ మేష్ ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ పాత్ వే, లైటింగ్ తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలో పనులు పూర్తి అయి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. చెరువు పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయడం పట్ల పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.