26-08-2024 03:46:23 PM
కీసర: మేడ్చల్ జిల్లా కీసర ఆర్ఎల్ నగర్ లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఆటో ఢీకొట్టడంతో కిందపడిన మహిళపై నుంచి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరొకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.