5 May, 2026 | 7:06 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ. 1.55 కోట్ల చెక్కుల పంపిణీ

03-12-2025 12:00 AM

కందుకూరు, డిసెంబర్ 2 ( విజయక్రాంతి ) : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కందుకూరు దీర్ఘకాలిక అప్పు పొందిన రైతులకు పిఏసిఎస్ చైర్మన్ అధ్యక్షతన హాజరైన పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో 14 మందికి సుమారు రూ. 1. 55 కోటి మంజూరు చేసిన చెక్కులను రైతులకు పంపిణి చేశారు.ఈ సందర్బంగా దేవరశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ, పిఏసిఎస్లో మొక్కజొన్న కొనుగోలు చేయబడిన బస్తాలు సుమారు 140 మంది రైతుల నుండి 22 వేల బస్తాలను కొనుగోలు చేసి ఇందులో 20 వేల బస్తాలను తెలంగాణ మార్క్ ఫెడ్ కు పంపిణి చేశామన్నారు.

అదేవిధంగా రైతులు దళారులను నమ్మి ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని సంఘ అభివృద్ధికి తోడ్పడాలని,సంఘం ద్వారా కొత్తగా అప్పు దరఖాస్తులు చేసుకోని సకాలంలో వడ్డీతోపాటు కిస్తులను  చెల్లించగలరని ఛైర్మెన్ దేవరశెట్టి చంద్రశేఖర్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంఘ కమిటీ పాలకవర్గ సభ్యులు సురసాని శేఖర్ రెడ్డి,నర్ల నరసింహా,గౌర పర్వతాలు, తీగల జగదీశ్వర్ రెడ్డి,సాద పాండు రంగారెడ్డి, మెఘవత్ చంద్రు నాయక్,పొట్టి ఆనంద్, సంఘ ఇంచార్జ్ సెక్రెటరీ కాలే మహేష్,సంఘ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.