17 March, 2026 | 10:45 PM

విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ

17-03-2026 09:34 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): యూత్ ఫర్ సేవా సహకారంతో ఎదులాబాద్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూలు బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో నూతన ఉత్సాహం నింపడానికి వాళ్ళ విద్యను కార్పొరేట్ సంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని ఒక ప్రయత్నంలో భాగంగా మంగళవారం విద్యార్థులకు పుస్తకాలతో కూడిన స్కూల్ బ్యాగ్ ని పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో యూత్ ఫర్ సేవా ఏపీ తెలంగాణ మేనేజర్ మెంగా అరవింద్, ముఖ్య అతిథిగా సామాజిక కార్యకర్త చలువాది ప్రవీణ్ రావు, గ్రామస్తులు రాచకట్ల శ్రీశైలం, పూస వెంకటేష్, హరికృష్ణ, పూస సాయికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ పాల్గొనడం జరిగింది.