calender_icon.png 8 June, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ. 10.11 కోట్ల గంజాయి, డ్రగ్స్ దగ్ధం

04-06-2025 12:51:11 AM

27 కేసుల్లో పట్టుబడిన గంజాయి, డ్రగ్స్ కాల్చివేత

సంగారెడ్డి, జూన్ 3(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్ స్టేషన్లలో 27 కేసుల్లో పట్టుబడిన రూ.10.11 కోట్ల విలువైన గంజాయి, ఆల్పోజోలం, డైజోఫామ్ మత్తు పదార్థాలను మంగళవారం దగ్ధం చేశారు. మెదక్ డిప్యూటి కమిషనర్ జె.హరికిషన్ డిస్పోజల్ అధికారిగా ఇచ్చిన  అదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్ స్టేషన్లలో పట్టుబడిన మత్తు పదార్థాలను మెడికేర్ వెస్టేజ్ మేనేజ్మెంట్ ఇస్నాపూర్ ప్రాంతంలో కాల్చివేశారు.

పటాన్ చెరు స్టేషన్లో 10 కేసులు, సంగారెడ్డి స్టేషన్లో 7 కేసులు, నారాయణఖేడ్లో 3, ఆదోల్లో నాలుగు కేసుల్లో పట్టుబడిన డ్రగ్స్, గంజాయిని సంగారెడ్డి ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ చందర్ అధ్వర్యంలో దహనం చేశారు. ఇందులో 209.162 కేజీల గంజాయి, 7 గ్రాముల డైజోఫామ్ , 0.496 కేజీల ఆల్పోజోలం, 0.468 కేజీల పప్పిస్ట్రా, 3 ఎంఎంసీ 90.23 కేజీలను దహనం చేశారు. దహనం చేసిన డ్రగ్స్ విలువ రూ. 10.11 కోట్లుగా  ఉంటుందని ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ చందార్‌తెలిపారు.