2 April, 2026 | 3:23 PM

Breaking News

కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..   •   పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •  

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు దుర్మార్గం

07-10-2025 01:42 AM

8న బస్‌భవన్ వద్ద ఆప్ నిరసన

ముషీరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు దుర్మార్గం అని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నేతలు బుర్ర రాము గౌడ్, విజయ్ మల్లంగి, ఎంఏ. మాజీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే విద్యార్థుల బస్సు పాసులు 30%, 50%  పెంచిన ప్రభుత్వం, మళ్లీ నేడు హైదరాబాద్ ప్రజలపై మరోసారి బస్సు చార్జీలు పెంచి  పేద మధ్యతరగతి కుటుంబాల సంపదను దోచుకుం టుందని మండిపడ్డారు. హైదరాబాద్ లిబర్టీ  ఆప్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియా  సమావేశంలో వారు మాట్లాడు తూ..  50%  బస్సు చార్జీలను పెంచడం  కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్ల ఎటువంటి చిత్తశుద్ధి  లేదని స్పష్టమవుతుందని విమర్శించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలకు ఉచిత బస్సు రవాణా పథకం కల్పిస్తూ, పురుషులపై ఎటువంటి చార్జి పెంపుల  భారం మోపలేదన్నారు. పెంచిన బస్ చార్జీలకు నిరసనగా 8న బస్ భవన్ వద్ద  ఆప్ నిరసన చేపడుతామన్నారు.