22 May, 2026 | 10:12 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలి

31-07-2025 12:00 AM

నల్లగొండ డిపో మేనేజర్ శ్రీనాథ్

శాలిగౌరారం, జులై 30 : గ్రామీణ ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం నడిపిస్తున్న ఆర్ టి సి బస్సులను సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ ఆర్‌టిసి డిపో మేనేజర్ ఎం. శ్రీనాథ్ కోరారు. బుధవారం శాలిగౌరారం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ నకిరేకల్ శాలిగౌరారం రూట్ లో నడిపిస్తున్న ఉప్పల్ ఎక్స్ రోడ్డు బస్సును,విద్యార్థుల సౌకర్యం కొరకు వేసిన నకిరేకల్-అమ్మనబోల్, నకిరేకల్  -చిత్తలూరు-గురజాల సద్వినియోగం చేసుకోవా లని కోరారు.

  బస్సులను ఆదరిస్తే ఆర్‌టిసికి ఆదాయం వస్తే నకిరేకల్ -శాలిగౌరారం రూట్‌లో మరిన్ని బస్సులు నడిపిస్తామన్నారు. మోడల్ స్కూల్ విద్యార్థుల సౌకర్యం కొరకు నార్కెట్పల్లి డిపో బస్సును నేటి నుంచి అమ్మనబోల్,గురజాల, శాలిగౌరారం మీదుగా నకిరేకల్ కు బస్సును నడిపిస్తున్నట్లు అయన తెలిపారు.

ఈ బస్సు అమ్మనబోల్‌లో ఉదయం 8 గంటలకు బయలుదేరి విద్యార్థులను తీసుకొని ఉదయం 9-15 కు నకిరేకల్ చేరుకుంటుందని అన్నారు. తిరిగి నకిరేకల్ లో సాయం త్రం 3-50 కి బయలుదేరి వల్లాల, శాలిగౌరారం, గురజాల మీదుగా అమ్మనబోల్ కు చేరుకుంటుందని డి ఎం శ్రీనాథ్ తెలిపారు.